Bhatti Vikramarka: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన భట్టి విక్రమార్క

రాష్ట్ర నీటిపారుదల శాఖ(Irrigation Department) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని ఉప ముఖ్యమంత్రి(Dy.CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) పరామర్శించారు.

Update: 2024-10-05 15:37 GMT

దిశ, వెబ్‌డెస్క్:రాష్ట్ర నీటిపారుదల శాఖ(Irrigation Department) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని ఉప ముఖ్యమంత్రి(Dy.CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) పరామర్శించారు.మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి(Purushottam Reddy) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ మేరకు భట్టి శనివారం సాయంత్రం కొండాపూర్(Kondapur)లోని ఉత్తమ్ నివాసానికి వెళ్లి పురుషోత్తం రెడ్డి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఉత్తమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.కాగా భట్టి విక్రమార్క తన విదేశీ పర్యటన ముగించుకొని నిన్ననే రాష్ట్రానికి తిరిగి వచ్చారు.


Similar News