Drugs Tests: అర్థరాత్రి హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ కలకలం..

పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.

Update: 2024-08-31 06:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మత్తుబాబు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఎక్సైజ్, టీఎస్ నాబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ రెయిడ్స్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న వారి బాగోతం బట్టబయలైంది. మొత్తం 25 పబ్ లలో సోదారు నిర్వహించిన అధికారులు పబ్బుల్లో 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు తెలింది. గత రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.


Similar News