కేకేకు వర్తించిన నిబంధన మిగతా వారికి వర్తించవా: ఎమ్మెల్యే హరీష్‌ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తేరలేపింది.

Update: 2024-07-08 11:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తేరలేపింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మె్ల్సీలను పార్టీలో చేర్చుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఎమ్మెల్యీలే, ఎమ్మిల్సీల చేరికలపై సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకేకు వర్తించిన నిబంధన మిగతా వారికి వర్తించవా అంటూ చురకలంటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి కేకేను పార్టీలో చేర్చుకున్నట్లుగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదేవిధంగా చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీలో నేతలు అప్పుడే అవినీతిలో మునిగిపోయారంటూ కామెంట్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నాయకత్వం మారింది.. పాలన మాత్రం ఏమాత్రం మారలేదని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రభుత్వ తీరును ఎండగడతామని హరీష్ బాబు అన్నారు.   


Similar News