కాంగ్రెస్ అంటేనే అబద్దపు హామీలు, రాజకీయ మోసం!.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

యువత గత పాలనలో లీకేజీలతో ద్రోహానికి గురైతే, ఇప్పుడు మోసంతో నిర్లక్ష్యానికి గురయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-14 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: యువత గత పాలనలో లీకేజీలతో ద్రోహానికి గురైతే, ఇప్పుడు మోసంతో నిర్లక్ష్యానికి గురయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిన్న రాత్రి అశోక్ నగర్ లో నిరుద్యోగుల ర్యాలీ చేపట్టిన దానిపై స్పందించిన ఆయన ర్యాలీకి సంబందించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ అంటేనే అబద్దపు, అమలు కానీ హామీలు, విఫలమైన గ్యారెంటీలు, రాజకీయ మోసం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే తెలంగాణ యువత గత బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలతో ద్రోహానికి గురైతే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అబద్దపు హామీలు, వీగిపోయిన వాగ్దానాలతో మోసం చేయబడి.. పూర్తిగా నిర్లక్ష్యానికి గుర్యయ్యారని అన్నారు. యువకుల ఆకాంక్షల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి ఆందోళనలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో యువత వారి భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడవలసి వచ్చిందని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో నిరుద్యోగ యువకుల నిరసన కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు, మోసాన్ని గుర్తు చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు శనివారం రాత్రి చిక్కడ్ పల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఆ ఆర్టీసీ క్రాస్ రెడ్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Tags:    

Similar News