మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే అధికారం.. ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కీలక కాంగ్రెస్ నేతలు అక్కడ పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-17 10:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కీలక కాంగ్రెస్ నేతలు అక్కడ పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని చంద్రాపూర్ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లు, అన్ని విభాగాలు, సెల్‌ల ఆఫీస్ బేరర్లు, బూత్ ప్రతినిధుల సమావేశం బల్లార్‌పూర్ గోపాల ప్యాలెస్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. కార్యకర్తల బలంతోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని, మహారాష్ట్ర లోను కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రాపూర్ ఎంపీ ప్రతిభ ధనోకర్, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ కోఆర్డినేటర్ వినోద్ దత్తాత్రేయ, చంద్రపూర్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News