Owaisi : బీజేపీని ఓడించేందుకు అందరినీ వెంట తీసుకెళ్లాలి: ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-12 06:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని వికారాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీ.. మూసీ అంటున్నారు.. మూసీ నది అనంతగిరి నుంచి మొదలవుతుంది. ఆ నది ప్రవహిస్తూ నల్గొండకు వస్తుందని ఒవైసీ అన్నారు. అయితే మీరు మా వెంట ఎందుకు పడుతున్నారు.. అని ప్రశ్నించారు. నేను మరోసారి చెబుతున్నాను.. మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకొకండని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

బీజేపీ బీ-టీమ్‌ ఆరోపణలపై ఒవైసీ స్పందన

హర్యానాలో ఫలితాలపై ఒవైసీ స్పందించారు. ‘హర్యానా ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలా గెలిచింది. నేను అక్కడ లేను.. లేకుంటే బీ-టీమ్ అని చెప్పేవారు.. అక్కడ వాళ్లు ఓడిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వల్ల ఓడిపోయారు?’ అని ప్రశ్నించారు. ‘నేను పాత పార్టీ (కాంగ్రెస్)కి చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మోడీని ఓడించడానికి మీరు అందరినీ వెంట తీసుకెళ్లాలి. మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు’ అని ఒవైసీ అన్నారు.


Similar News