కిషన్ రెడ్డి, బండికి కేంద్ర మంత్రి పదవులు.. దద్దరిల్లిన టీ-బీజేపీ స్టేట్ ఆఫీస్

రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా నియామకమైన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ

Update: 2024-06-10 14:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా నియామకమైన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ను నియమించడంతో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సంబురాలు చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కలిసి అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి కలిసి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని అభినందించారు. వారితో పాటు మహా బ్రాహ్మణ సంఘటన్ నాయకుడు సుబ్బారావు శాస్త్రితో పాటు జయశ్రీ, పరిణిత, సుధ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.


Similar News