ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈనెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు.

Update: 2024-10-14 13:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈనెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశానికి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరవనున్నారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. 


Similar News