CM Revanth: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దసరా(Dussehra) శుభాకాంక్షలు చెప్పారు.

Update: 2024-10-11 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దసరా(Dussehra) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ సాంస్కృతిక జీవనవిధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పంగల్లో దసరా ఒకటి. తెలుగు ప్రజలకు దసరా అతిపెద్ద పండగ. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి మొదలైంది. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు ఆల్రేడీ పయణమయ్యారు. ఈ క్రమంలోనే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విజయదశమి రోజున అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతుంటారు.


Similar News