సొంత వాహనంలోనే ప్రజా దర్బార్‌కు CM రేవంత్ రెడ్డి

ప్రజాభవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

Update: 2023-12-08 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాభవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సొంత వాహనంలోనే ప్రజాదర్బార్‌కు రేవంత్ రెడ్డి వచ్చారు. ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజాదర్బార్‌లో సీఎం పాల్గొని ఒక్కొక్కరి సమస్యలు వింటూ విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాదర్బార్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు వచ్చారు. ప్రజాదర్బార్ ముగిసిన తర్వాత 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు వెళ్లనున్నారు. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. 

Read More..

HYD: సీఎం ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు  


Similar News