నేడు సచివాలయంలో CM రేవంత్ రెడ్డి సమీక్ష.. కీలక అంశాలపై చర్చ
లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) విధివిధాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) విధివిధాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్లో జరిగే ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకొని.. ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని ప్రత్యేక చొరవ తీసుకొనున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలనే యోచన చేస్తుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనుకుంటోంది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మెనేజ్మెంట్ను పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని వారం రోజుల కిందటే సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తుంది.