BREAKING: ప్రజా భవన్‌కు చేరుకున్న తెలంగాణ టీమ్.. మరి కాసేపట్లో రానున్న ఏపీ బృందం

రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న విషయం

Update: 2024-07-06 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక భేటీలో పాల్గొనే తెలంగాణ టీమ్ ప్రజా భవన్‌కు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు కాసేపటి క్రితం ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అధికారులు వీరికి స్వాగతం పలికారు. మరోవైపు ఈ భేటీలో పాల్గొనే ఏపీ బృందం మరికాసేపట్లో ప్రజా భవన్‌కు రానుంది. సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలు దేరారు. మరికాసేపట్లో ఆయన ప్రజా భవన్‌కు రీచ్ కానున్నారు. గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ భేటీ జరగనుంది. 


Similar News