CM Relief Fund : వరద బాధితులకు CREDAI భారీ విరాళం.. అభినందించిన సీఎం రేవంత్

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రిలిఫ్ ఫండ్‌కు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు.

Update: 2024-09-08 15:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రిలిఫ్ ఫండ్‌కు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్(CREDAI) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు సీఎం క్రెడాయ్‌ని అభినందించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రెండు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. పంట, ఆస్తి, ప్రాణ నష్టం పలు జిల్లాల్లో భారీగా జరిగింది. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సెలబ్రీటీలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు వారికి తోచిన సహాయం అందిస్తున్నారు.


Similar News