కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సడన్‌ టూర్‌కు కారణమిదే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయణమయ్యారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ముగియగానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Update: 2024-08-15 15:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయణమయ్యారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ముగియగానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారు. మొత్తంగా రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. కాగా, ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం మరోసారి ఢిల్లీకి వెళ్లనుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేబినెట్ విస్తరణపైనా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News