TG SEC: పంచాయతీ ‘ఓటరు జాబితా’ షెడ్యూల్‌ లో మార్పులు

పంచాయతీ ‘ఓటరు జాబితా’ షెడ్యూల్‌ లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు.

Update: 2024-09-05 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా దానిని ఈ నెల 13వ తేదీకి మార్చినట్లు ఎస్ఈసీ పార్థసారథి గురువారం వెల్లడించారు. ఈ నెల 18,19 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని ఈ నెల 28న వార్డుల వారీగా తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 


Similar News