విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్పు.. ఏజీ సుదర్శన్ రెడ్డితో CM రేవంత్ మంతనాలు

విద్యుత్ కొనుగోలు అంశంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2024-07-16 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ కొనుగోలు అంశంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మన్ ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలన్న సుప్రీం ఆదేశాలతో తదుపరి చర్యలను తెలంగాణ సర్కారు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు చేస్తు్న్నారు. కలెక్టర్ల సమావేశం మధ్యలోంచి సీఎం ఛాంబర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఏజీ సుదర్శన్‌తో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ కమిషన్ జడ్జి మార్పుపై చర్చించారు. పలువురు సీనియర్ జడ్జిల పేర్లను ఏజీ సీఎం రేవంత్‌కు సూచించారు. మరి కాసేపట్లో కమిషన్ చైర్మన్‌గా కొత్త జడ్జి పేరును ప్రకటించే అవకాశం ఉంది.   

Tags:    

Similar News