బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Update: 2024-09-30 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తల తోపులాట, వాగ్వాదం నెలకొన్నాయి. కొంతమంది కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


Similar News