BREAKING : రాష్ట్రపతిని కలవనున్న ప్రధాని మోడీ
నేడు ఢిల్లీలో ఎన్డీయే కూటమి ముఖ్య సమావేశం నిర్వహించనుంది.
దిశ, వెబ్డెస్క్: నేడు ఢిల్లీలో ఎన్డీయే కూటమి ముఖ్య సమావేశం నిర్వహించనుంది. ఎల్లుండి బీజేపీ, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎన్నిక కోసం భేటీ జరగనుంది. కొత్త ఎంపీలను ఉద్దేశించి ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రధాని మోడీ కోరనున్నారు.