BJP: ఇందిరమ్మ రాజ్యం ముసుగులో నఫ్రత్ కా బజార్.. బండిసంజయ్ సంచలన ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన ఇదేనా? అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-10-20 07:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన ఇదేనా? అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత వచ్చిన ఉద్యోగ అవకాశం మళ్లీ రాదని, తెలుగు అకాడమీ పుస్తకాలు చెల్లవని అంటున్నారని ఓ గ్రూప్స్ ఉద్యోగ అభ్యర్థి రోదిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. తెలంగాణలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ముసుగులో విద్వేశాల బజార్ తెరిచిందని విమర్శించారు. అలాగే ఈ బాధ మిమ్మల్ని కదిలించకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమేనా? ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. ఇక భవిష్యత్ తరం వీధుల్లో లాఠీలు.. క్రూరత్వంతో విలపిస్తున్నప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News