Breaking: నవనీత్ కౌర్‌పై కొత్త కేసు.. 15 సెకన్లు చాలు.. వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెనర్, సినీ నటి నవనీత్ కౌర్‌పై మరో కేసు నమోదు అయింది.

Update: 2024-05-11 10:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెనర్, సినీ నటి నవనీత్ కౌర్‌పై మరో కేసు నమోదు అయింది. ఓవైసీ సోదరులపై 15 సెకన్లు చాలు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని యాకత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న రాకేష్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మే 8న లక్ష్మీ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో నవనీత్ రాణా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయన నివేదించారు.

2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను నవనీత్ గుర్తుచేశారు. ‘వాళ్లకు 15 నిమిషాలేమో.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. కాగా, ఇటీవల నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్లే వ్యాఖ్యనించడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News