TG Assembly : నిధులిస్తారా.. మ‌హారాష్ట్రలో క‌లుపుతారా..? : బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీష్‌బాబు అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-30 06:41 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీష్‌బాబు అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ‘మా ప్రాంతంపై ఎందుకో చిన్నచూపు, తీవ్ర వివక్ష ఉంది. బడ్జెట్ కేటాయింపులు లేవు. మా జీవన ప్రమాణాలు పెంచండి.. మాకు నిధులు కేటాయించండి.. లేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలపండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  

Tags:    

Similar News