నెరవేరబోతున్న చిరకాల స్వప్నం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కీలక ప్రకటన

నిజాం షుగర్ ఫ్యాక్టరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Update: 2024-07-25 09:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ పై బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బడ్జెట్ ప్రసంగంలో భట్టి నిజాం షుగర్స్ లిమిటెడ్ పై మాట్లాడారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు గత జనవరిలో ఒక కమిటీని నియమించామని చెప్పారు. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయిన నిజాం షుగర్స్ లిమిటెడ్ ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణకు గర్వకారంగా ఉన్న ఈ ఫ్యాక్టరీ పలు రకాల ఒడిదొడుకల కారణంగా మూత పడిందని అన్నారు. దీనిని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, పునరుద్ధరించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదని విమర్శించారు.

Tags:    

Similar News