సీఎం రేవంత్ రెడ్డికి విరాళ చెక్కును అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేసింది.

Update: 2024-10-24 06:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేసింది. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ కలిశారు. సీఎం సహాయ నిధి విరాళ చెక్కును అందించారు. వరద బాధితుల సహాయార్ధం సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు.

సచివాలయంలో, సీఎం నివాసంలో తమ విరాళాల చెక్కులను అందచేస్తున్నారు. ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందిస్తున్నారు. కొందరు తమ మంత్రుల ద్వారా సీఎం సహాయ నిధి విరాళాల చెక్కులను అందచేస్తున్నారు. 


Similar News