Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Update: 2024-10-24 09:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడంతో తాజాగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.


Similar News