TGSRTC: హనుమకొండ జిల్లాలో ఘటన.. ఆర్టీసీ బస్సులో మృతి చెందిన మహిళ

ఆర్టీసీ బస్సులో ఓ మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.

Update: 2024-10-24 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామనికి చెందిన అంకిల కవిత అనే మహిళ గురువారం భర్తతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయానిస్తున్నది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఇది గమణించిన భర్త ఆమెను కదిలించేందుకు ప్రయత్నించగా.. లాభం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కను నిలిపివేశాడు. మహిళ మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని కిందికి దించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె భర్త నిస్సహాయ స్థితిలో ఉండి పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది.


Similar News