Bandi Sanjay: ఈ మోసం ఇంకెంత కాలం..? కాంగ్రెస్ ట్వీట్‌కు కేంద్రమంత్రి రిప్లై

తెలంగాణలో కాంగ్రెస్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని, తన అబద్దాలతో దేశాన్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-10-20 11:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని, తన అబద్దాలతో దేశాన్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో 40 లక్షల రైతులకు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంకా చేయలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై దేశంలోనే అతిపెద్ద నకిలీ వార్తల వ్యాపారిగా కాంగ్రెస్‌ అవతరించిందని, తెలంగాణ రైతులను కాంగ్రెస్ అన్ని విధాలుగా విఫలం చేసిందని ఆరోపించారు.

తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు పంట రుణమాఫీ జరగలేదని, ఈ పథకం పూర్తిగా ఫ్లాప్ అని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. ఇక మోడీ కాంగ్రెస్ యొక్క బూటకపు ప్రచారాన్ని చూశారని, అంతేగాక ఇటీవల వారి తప్పుడు వాదనల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టారని తెలిపారు. ఖరీఫ్‌కు రైతు బంధు ఇవ్వలేదని, పథకం ప్రారంభించిన తర్వాత ఇది మొదటిసారి కావడం ప్రభుత్వానికి అవమానమని అన్నారు. ఇక ఎమ్ఎస్‌పీ మీద రూ.500 బోనస్ అనేది రైతులపై కాంగ్రెస్ ఆడిన క్రూరమైన జోక్ తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ తన అబద్ధాలతో దేశాన్ని ఎంతకాలం మోసం చేస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.


Similar News