ఒక సమూహం పై మరొక సమూహం దాడి..ఎక్కడంటే?

రెండు సమూహాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, ఒక సమూహం పై మరొక సమూహం దాడి చేసుకున్న ఘటన తానూరు మండలం లో చోటుచేసుకుంది.

Update: 2024-09-08 06:31 GMT

దిశ, భైంసా:రెండు సమూహాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, ఒక సమూహం పై మరొక సమూహం దాడి చేసుకున్న ఘటన తానూరు మండలం లో చోటుచేసుకుంది. మండల ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం..తానూర్ మండలం ఝరి(బి) గ్రామంలో శనివారం రాత్రి ఒకరి సమూహం పై మరొక సమూహం దాడి చేసుకోగా, విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, స్థానిక మండల ఎస్ఐ సందీప్ ఘటన స్థలానికి చేరుకొని దాడిని నిలిపివేశారు. దాడికి పాల్పడిన ఇరు సమూహాల పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Similar News