తెలంగాణకు మరో వందే భారత్ రైలు

ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది రైల్వే శాఖ.

Update: 2024-09-09 13:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది రైల్వే శాఖ. తెలంగాణకు మరో వందే భారత్ రైలును ప్రకటించింది. సికింద్రాబాద్ నుండి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుండి ఈ కొత్త సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దీనిని ప్రారంభిస్తారని, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రైలు నాగపూర్ నుండి ఉదయం 5 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12.15 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మళ్ళీ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 కి నాగపూర్ చేరుకుంటుంది. కాగా కాజీపేట, రామగుండం, బళ్లార్ష, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. సికింద్రాబాద్, నాగపూర్ నగరాల మధ్య 578 కిమీల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో చేరుకుంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా.. ఇది ఐదవది.


Similar News