జానీ మాస్టర్ తరహాలో మరో కేసు.. ఫోక్‌ సింగర్‌పై అత్యాచారం ఆరోపణలు

Update: 2024-09-29 04:56 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: సోషల్ మీడియా సెలబ్రిటీలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదవుతుండడం సంచలనగా మారుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇక యూట్యూబ్ ఫేమ్ హర్ష సాయిపై కూడా ఓ యువతి లైంగికంగా వేధించాడంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేస్ కూడా వైరల్ అయింది. ఇక ఇప్పుడు అదే తరహాలో జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ ఫోక్ సాంగ్ రైటర్, సింగర్, జిల్లా సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా పని చేస్తున్న సుద్దాల మల్లిక్ తేజపై ఓ యువతి బలాత్కారం కేస్ పెట్టింది. యూట్యూబ్ చానల్స్‌లో ఫోక్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సదరు యువతి తనను మల్లిక్ తేజ మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి పలుసార్లు స్టూడియోలో అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ఐడీలు పాస్వర్డ్ మార్చి పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఇరువురు చాలా ఫోక్ సాంగ్స్ చేసి గుర్తింపు పొందడమే కాక గతంలో అనేక టీవీ షోలలో సైతం కలిసి పాల్గొన్నారు.


Similar News