ఫోన్ ట్యాపింగ్ కేసు: భుజంగ రావు, తిరుపతన్నలకు మరో బిగ్ షాక్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగ రావు, తిరుపతన్నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ దాఖలు చేసిన
దిశ, వెబ్డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగ రావు, తిరుపతన్నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను నాంపల్లి కోర్ట్ బుధవారం డిస్మిస్ చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. తిరుపతన్న, భుజంగరావులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం జ్యూడిషియిల్ రిమాండ్లో భాగంగా చంచల్ గూడ జైలులో ఉన్న తిరుపతన్న, భుజంగ రావులు కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారు.