గిరిజన ఆదివాసీలు సంయమనం పాటించాలి

జైనూర్ మండల పరిధిలో ఆదివాసీ మహిళపై జరిగిన భౌతిక దాడి నేపథ్యంలో జిల్లాలోని గిరిజన ఆదివాసీలు సంయమనం పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే బుధవారం కోరారు.

Update: 2024-09-04 13:34 GMT

దిశ, ఆసిఫాబాద్ : జైనూర్ మండల పరిధిలో ఆదివాసీ మహిళపై జరిగిన భౌతిక దాడి నేపథ్యంలో జిల్లాలోని గిరిజన ఆదివాసీలు సంయమనం పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే బుధవారం కోరారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం తరఫున సహాయం అందించి తగు న్యాయం చేస్తామన్నారు. నిందితుడిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని, గిరిజన ఆదివాసీ నాయకులు సంయమనం పాటించాలని కలెక్టర్ కోరారు. 

Tags:    

Similar News