‘అన్యాయంగా అరెస్ట్‌లు వద్దు..నిజా,నిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోండి’

పట్టణానికి చెందిన పలువురు మహిళలు,హిందూ ధర్మ రక్షక సమితి సభ్యులు

Update: 2024-10-04 14:53 GMT

దిశ,భైంసా : పట్టణానికి చెందిన పలువురు మహిళలు,హిందూ ధర్మ రక్షక సమితి సభ్యులు శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ ని కలిశారు. అన్యాయాన్ని అడ్డుకున్న యువత పై అక్రమ అరెస్టులు,కేసులు చేయకుండా నిజ నిజాలు తెలుసుకుని పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవాలని వారు తమ బాధను విన్నవించి వినతి పత్రం అందించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ...రెండు రోజుల క్రితం కుబీర్ మండలానికి చెందిన ఓ వర్గానికి చెందిన మైనర్ అమ్మాయిని బెదిరించి,అత్యాచారానికి యత్నించిన, మరొక వర్గానికి చెందిన యువకుడిని పలువురు హిందువులు అడ్డుకున్నారని, ఆ వ్యక్తులపై హత్యాయత్నం కేసులు లాంటివి తొలగించాలని డిమాండ్ చేశారు.అక్రమ కేసులతో యువత కుటుంబీకులు భయబ్రాంతులకు గురి అవుతున్నారని,ఆ యువకుని చరవాణిలో కత్తులు,తల్వార్లు,గన్ లతో ఉన్న ఫొటోస్ వున్నాయని,అలాంటి వ్యక్తి ఎక్కడి వాడు,అతని షాప్,ఇండ్లలొ సోదాలు చేసి అతనికి ఉగ్రవాదులతో,ఇంకా ఎవరితో అయిన సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టాలని కోరారు.


Similar News