పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురిపై కేసు నమోదు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం లో

Update: 2024-10-04 16:38 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం లో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు కౌటాల సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో పెంచికలపేట ఎస్సై కొమురయ్యలు పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాట ఆడుతున్న బండి ప్రభాకర్, చిలువేరు భాస్కర్, దాసరి చంద్రమౌళి, గణపురం శ్రీకాంత్, రామగోని శంకర్ గౌడ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.9140, రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Similar News