ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్ట భద్రత : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్టమైన భద్రత ఏర్పాటు

Update: 2024-10-04 13:32 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గత పార్లమెంట్ ఎన్నికల్లో సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన 1 బ్యాలెట్ యూనిట్. 10 వీవీ ప్యాట్ లను మరమ్మతుల కోసం ఈసీఎల్ హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాములో పోలీస్ భద్రత తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘాలో ఉంటుందని చెప్పారు.


Similar News