అమృత ఇండెన్ గ్యాస్ ఐడీ పేరుతో మోసాలు..

Update: 2023-10-11 14:07 GMT

దిశ, పెంబి: అమృత ఇండేన్ గ్యాస్ అంటు ఐడీ కార్డ్ కలిగి ఉన్న నలుగురు వ్యక్తులు కలిసి మోసాలు పాల్పడుతున్న సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండల కేంద్రంలోని మందపల్లి గ్రామంలో అమృత ఇండియన్ గ్యాస్ అంటూ.. ఐడీలు పెట్టుకుని ఎల్పీజీ ఇండియన్ గ్యాస్ వినియోగదారుల వద్దకు వెళ్లి సర్వీస్ చేస్తామని చెప్పి.. 200 నుండి 400 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.


దీంతో గ్రామస్తులు వారిని గ్రామ పంచాయతీలో నిర్బంధించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ జరపగా తీసుకున్న నగదు మొత్తం వినియోగదారులకు తిరిగి ఇవ్వడం జరిగింది.


Similar News