వెంటనే మరమ్మతులు చేపట్టాలిః కలెక్టర్ వెంకటేష్ దోత్రే

Update: 2024-09-02 14:55 GMT

దిశ, ఆసిఫాబాద్ః వర్షానికి దెబ్బ తిన్న తుంపెల్లి కల్వర్టును వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న తూంపల్లి వాగుపై ఉన్న కల్వర్టు, రహదారిని తహసీల్దార్ తో కలిసి పరిశీలించారు. కల్వర్టు కోతకు గురికావడంతో 10 గ్రామాల ప్రజల రాకపోకలకు నిలిచిపోయా యని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Similar News