రోడ్డు ప్రమాదంలో పాత్రికేయునికి తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ ప్రజాపక్షం రిపోర్టర్ రామచంద్ర గౌడ్ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కి వెళ్లిన క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.

Update: 2024-10-13 12:08 GMT

దిశ,సారంగాపూర్ : నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ ప్రజాపక్షం రిపోర్టర్ రామచంద్ర గౌడ్ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కి వెళ్లిన క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే తక్షణ ఆపరేషన్ అవసరం.

    ఇందుకోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. రామచంద్ర గౌడ్ పేద కుటుంబానికి చెందినవాడు కావడంతో ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం వారికి కష్టంగా మారింది. ఆపన్నహస్తం కోసం మానవతావాదులు, దాతలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు Gpay/Phonepay నెంబర్ 8885013554కు ఆర్థిక సహాయం అందించాలని బాధితుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 

Tags:    

Similar News