బీఎడ్ కళాశాల ఎదుట ప్రజాసంఘాల ధర్నా

బీఎడ్ శిక్షణ పూర్తయి ఏడాది కావస్తున్నా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.

Update: 2024-09-13 10:10 GMT

దిశ, ఆసిఫాబాద్ : బీఎడ్ శిక్షణ పూర్తయి ఏడాది కావస్తున్నా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం జిల్లాలో రాజేంద్రప్రసాద్ బీఎడ్ కళాశాల ఎదుట బైఠాయించి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.

    విద్యార్థుల టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు బీఎడ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోలేదని గుర్తు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. వినకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News