హెచ్ డబ్ల్యూఓను సస్పెండ్ చేసిన కలెక్టర్

Update: 2024-08-15 13:07 GMT

దిశ, ఆదిలాబాద్ః జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల ఖండాల ప్రభుత్వ గిరిజన శాటిలైట్ సెంటర్ పొతగూడ హెచ్ డబ్ల్యూ వో జై వంతును కలెక్టర్ సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలో బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన వార్డెన్ తరచు విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినందున జిల్లా కలెక్టర్ సదరు వార్డెన్ ను సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. కాగా ప్రభుత్వ అధికారులతో పాటు వసతి గృహాలు, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, వార్డెన్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Tags:    

Similar News