ఇరువర్గాలు చర్చించుకొని ధరలు నిర్ణయించాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇరువర్గాలు సమన్వయంతో

Update: 2024-10-15 15:37 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇరువర్గాలు సమన్వయంతో చర్చించుకొని రవాణా ధరలను నిర్ణయించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ,సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యానికి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్పలతో కలిసి పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పేపర్ మిల్లు యాజమాన్యం,లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య నెలకొన్న సమస్యలను కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించి,సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ నిర్వహణ దృష్ట్యా మిల్లు ప్రతినిధులు స్థానిక లారీ యజమానులకు పని కల్పించి మిల్లు అభివృద్ధితో పాటు లారీ యాజమాన్యం లబ్ధి పొందేలా చూడాలని కోరారు.


Similar News