సీఎం రేవంత్ రెడ్డితో అభిషేక్ మను సింఘ్వీ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ మను సింఘ్వీ భేటీ అయ్యారు.

Update: 2024-08-16 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ మను సింఘ్వీ భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి సింఘ్వీని రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత మొదటిసారి ఇరువురు శుక్రవారం సమావేశం అయ్యారు. సెప్టెంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 21వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ భేటీలో నామినేషన్ మొదలుకొని దేశ, రాష్ట్ర రాజకీయాలపై లోతుగా చర్చించినట్లు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ నేత కే.కేశవరావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే.. కేకే స్థానంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నరన్న ఉత్కంఠకు తెర దించుతూ.. ఏఐసీసీ సింఘ్వీ పేరును అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News