ఇండిగో విమానంలో సాంకేతికలోపం.. 5 గంటలుగా ఇబ్బందులు
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది...
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్టులో విమానం నిలిచిపోయింది. అయితే విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు మరమ్మతులు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం(Indigo flight) 5 గంటలుగా ఎయిర్ పోర్టులో ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో విమానం ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపలతో ఎయిర్ పోర్టులో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా మరో ఫ్లైట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.