వరదల్లో మృతులు 16 మంది కాదు 31మంది : కేటీఆర్

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో మృతి చెందింది 16 మంది కాదని, 31 మంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

Update: 2024-09-06 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో మృతి చెందింది 16 మంది కాదని, 31 మంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ వద్ద మృతుల పూర్తి వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యాలో ఉన్న ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా మృతుల వివరాలను పోస్టు చేశారు. వరదల్లో మృతి చెందిన వారి తుది జాబితాను విడుదల చేయడంలో సీఎంఓ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజలకు మృతుల పేర్లు, వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇది కేవలం నిర్వహణ లోపం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల కష్టాలను అపహాస్యం చేయడమేనన్నారు. కేవలం 16 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం ఎలా నిర్ధారణకు వచ్చిందో చెప్పాలన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు ఎందుకు పంపిణీ చేయడం లేదో కూడా వివరించాలని డిమాండ్ చేశారు.


Similar News