మంత్రి బుగ్గన ఇప్పుడు ఎక్కడున్నారు: అశోక్‌బాబు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. గతంలో ఈసీని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకమన్న మంత్రి బుగ్గన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి బుగ్గనకు అశోక్‌బాబు లేఖ రాశారు. అమెరికాలో ట్రంప్.. ఏపీలో జగన్ రాజ్యాంగేతర శక్తులుగా నిలిచారని అన్నారు. ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయదా […]

Update: 2021-01-24 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. గతంలో ఈసీని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకమన్న మంత్రి బుగ్గన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి బుగ్గనకు అశోక్‌బాబు లేఖ రాశారు. అమెరికాలో ట్రంప్.. ఏపీలో జగన్ రాజ్యాంగేతర శక్తులుగా నిలిచారని అన్నారు. ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయదా ?అన్న అశోక్‌బాబు.. రాజ్యాంగ సంస్థల్ని సీఎం జగన్ చెప్పు చేతల్లో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News