డ్రగ్స్ టెస్ట్‌కు వచ్చి.. హల్‌చల్ చేసిన టీడీపీ నేత

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఓ అడుగు ముందుకు వేశారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే తనయుడి పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉదయభాను తనయుడు ఈ వ్యవహారం నడిపిస్తున్నాడని.. దమ్ముంటే డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాను కూడా డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. అందులో […]

Update: 2021-10-01 05:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఓ అడుగు ముందుకు వేశారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే తనయుడి పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉదయభాను తనయుడు ఈ వ్యవహారం నడిపిస్తున్నాడని.. దమ్ముంటే డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాను కూడా డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరుకున్నారు. డ్రగ్స్ పరీక్షకు సంబంధించి వైసీపీ నేతలు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ధ్వజమెత్తారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము వైసీపీ నేతలకు లేదని ఇవాళ్టితో తేలిపోయిందన్నారు. వైసీపీ నేతలు ఎప్పుడు పిలిచినా డ్రగ్ టెస్టుకు తాము సిద్ధమని పట్టాభి స్పష్టం చేశారు.

Tags:    

Similar News