తిరుమల లడ్డూ వ్యవహారం.. వైసీపీ నేతలకు జగన్ కీలక పిలుపు
తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.
దిశ, వెబ్డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో గత ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలు చెబుతున్నారని.. తిరుమలలో ఎటువంటి కల్తీ జరగకుండానే.. కల్తీ జరిగిందని ఆరోపిస్తూ.. తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగించారని.. మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అబద్దపు ప్రచారానికి నిరసనగా ఈ నెల 28, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు నిర్వహించాలని, వైసీపీ నేతలంతా ఈ పూజల్లో పాల్గొనాలని.. జగన్ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.