మన దీప్తి అదరగొట్టింది.. పారాలింపిక్స్‌లో కాంస్యం కైవసం

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అదరగొట్టింది.

Update: 2024-09-03 17:44 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అదరగొట్టింది. పతక మోత మోగించింది. మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో దీప్తి కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో దీప్తి 55.82 సెకన్ల సమయంలో రేసును ముగించి బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. తొలి పారాలింపిక్స్‌లోనే దీప్తి పతకం గెలవడం విశేషం. దీప్తి గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.  


Similar News