IND Vs WI 3rd T20 : విండీస్తో మూడో టీ20.. యశస్వీ జైస్వాల్ ఇన్.. సంజూ శాంసన్ ఔట్!
ఐదు టీ20ల సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది.
దిశ, వెబ్డెస్క్: ఐదు టీ20ల సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన టీమ్ఇండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే టీమ్ఇండియా తుది జట్టులో సంజూ శాంసన్ను తప్పించి.. యశస్వీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్కు చోటిచ్చే అవకాశం ఉంది. అదే జోరును కొనసాగించి ఆధిక్యాన్ని ట్రిపుల్ చేసుకోవాలని విండీస్ భావిస్తోంది.
భారత్ తుది జట్టు(అంచనా):
యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్/ఉనాద్కత్, యుజ్వేంద్ర చాహల్