PV Sindhu : సింధుకు మళ్లీ నిరాశే.. క్వార్టర్స్‌లో ఓటమి

భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది.

Update: 2024-10-18 14:03 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. డెన్మార్క్‌లో జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె క్వార్టర్ ఫైనల్‌లో నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 13-21, 21-16, 9-21 తేడాతో ఇండోనేషియా షట్లర్ జార్జియా మరిస్కా టుంజుంగ్ చేతిలో పరాజయం పాలైంది.

తొలి గేమ్‌ కోల్పోయిన తర్వాత పుంజుకున్న సింధు రెండో గేమ్‌ నెగ్గి పోటీలోకి వచ్చింది. అయితే, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది. సింధు నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. మిగతా షట్లర్లు ఇప్పటికే ఇంటిదారిపట్టారు. గత రెండేళ్లుగా సింధు ఫామ్ లేమి, గాయాలతో సతమతమవుతున్నది. 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆమె ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేదు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయిన సింధు ప్రీక్వార్టర్స్‌లో ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News