Ind Vs WI 3rd ODI : మూడో వన్డేలో ఆ ఇద్దరు.. భారత్‌కు విజయం దక్కేనా?

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో రోహిత్​సేన మూడో వన్డే తలపడనుంది.

Update: 2023-08-01 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో రోహిత్​సేన మూడో వన్డే తలపడనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ‍కష్టపడి విజయం సాధించిన భారత్‌.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజాయం పాలైంది. దీంతో ఈ ఆఖరి మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం..) మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ 1-1 సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్‌ విభాగంలో ప్రయోగాలు చేసిన భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది.

బ్యాటింగ్‌లో ప్రయోగాలతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి టీమ్‌లో లేకపోవడం వల్ల జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా పూర్తి స్దాయి జట్టునే ఆడించాలని జట్టు మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తుది పోరులో ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో వన్డేను చేజిక్కించుకున్న కరేబియన్​జట్టు.. అదే జోరుతో ఆఖరి పోరులోనూ విజయపథంలో నడవాలని ఆశిస్తోంది.


Similar News